News March 7, 2025

21 మంది IPSల బదిలీ

image

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
*నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య
*ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్
*కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
*కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర
*రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా
*వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
*సూర్యాపేట ఎస్పీగా నరసింహ
*సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోశ్
*ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూ శర్మ
*నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్
*పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్

Similar News

News January 18, 2026

భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారో తెలుసా?

image

ప్రపంచంలోనే ఎక్కువ సవరణలు జరిగింది భారత రాజ్యాంగంలోనే. 1949, NOV 26న రాజ్యాంగ సభ ఆమోదం పొంది 1950, JAN 26న అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటివరకు 106సార్లు సవరణలు చేశారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించడాన్ని తప్పనిసరి చేస్తూ 2023 SEPలో చివరిగా సవరించారు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల డీలిమిటేషన్స్‌ పూర్తైన తర్వాత రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.

News January 18, 2026

‘గ్రీన్‌లాండ్‌ డీల్’ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్

image

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే తన లక్ష్యాన్ని వ్యతిరేకించిన దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్‌, ఇతర యూరప్ దేశాలపై 10 శాతం సుంకాలు విధించారు. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. గ్రీన్‌లాండ్ డీల్ పూర్తి కాకపోతే జూన్ 1 నుంచి టారిఫ్స్‌ను 25 శాతానికి పెంచుతానని హెచ్చరించారు.

News January 18, 2026

మెరిసిన మంధాన.. RCB ఘన విజయం

image

WPL: ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో RCB 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ స్మృతి మంధాన(96), జార్జియా హాఫ్ సెంచరీ(54*)తో రాణించడంతో 167రన్స్ లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. DC బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. మారిజాన్‌, నందినీ శర్మలకు చెరో వికెట్ దక్కింది. ఢిల్లీ తరఫున షెఫాలీ వర్మ(62) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.