News August 24, 2024
ప్రజ్వల్ రేవణ్ణపై 2144 పేజీల ఛార్జిషీటు

జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ముందడుగు పడింది. కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనపై 2144 పేజీల ఛార్జిషీటును దాఖలు చేసింది. లైంగిక వేధింపులు, బలవంతం చేశారని ఇంటి పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. సరిగ్గా ఎన్నికల సమయం కావడంతో రేవణ్ణ కేసు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపింది. అరెస్టు చేస్తారని జర్మనీకి వెళ్లిపోయిన ఆయన కుటుంబ సభ్యుల ఒత్తిడితో బెంగళూరుకు తిరిగొచ్చారు.
Similar News
News March 29, 2026
భూభారతి ద్వారా ₹12,443కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు: ప్రభుత్వం

TG: భూభారతి పోర్టల్లో లావాదేవీల ద్వారా ₹1,518.64కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోర్టల్లో 6.17లక్షల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్స్ జరిగాయని.. జనవరి నాటికి ₹12,443.64కోట్ల విలువైన రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం ₹16,021కోట్లకు చేరాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది. కాగా ధరణిని భర్తీ చేస్తూ గత ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం లాంచ్ భూభారతి చేసింది.
News March 29, 2026
నేడు MI vs KKR

ఐపీఎల్ 2026లో ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ జట్లు 35సార్లు తలపడగా ఇందులో 24 విజయాలతో ముంబైదే పైచేయి. ఇక MI vs KKR మ్యాచ్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ (232), లోయెస్ట్ స్కోర్ (67) కూడా కేకేఆర్ పేరునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రా.7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News March 29, 2026
నేడు MI vs KKR

ఐపీఎల్ 2026లో ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ జట్లు 35సార్లు తలపడగా ఇందులో 24 విజయాలతో ముంబైదే పైచేయి. ఇక MI vs KKR మ్యాచ్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ (232), లోయెస్ట్ స్కోర్ (67) కూడా కేకేఆర్ పేరునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రా.7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.


