News December 21, 2024

22న కడపకు మంత్రి కందుల రాక

image

రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈనెల 22న కడపకు వస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. రాజమండ్రి నుంచి ఆయన రైలు మార్గాన ఆదివారం ఉదయం కడపకు చేరుకుంటారు. మేడా ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి సాయంత్రం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి రాజమండ్రికి వెళ్తారు.

Similar News

News January 25, 2025

YS వివేకా ఘటనపై స్పందించిన విజయసాయిరెడ్డి

image

మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యపై విజయసాయిరెడ్డి స్పందించారు. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యానని, వెంటనే అవినాశ్ రెడ్డికి ఫోన్‌ చేయగా పక్కన ఉన్న వ్యక్తికి ఫోన్ ఇచ్చారన్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు నాకు చెప్పారని, ఫోన్‌లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది.

News January 25, 2025

పులివెందులలో YS జయమ్మ 18వ వర్ధంతి వేడుకలు

image

పులివెందులలో వైఎస్ జయమ్మ 18వ వర్ధంతి వేడుకలలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని డిగ్రీ కళాశాలలోని జయమ్మ సమాధి వద్ద మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైయస్ జార్జిరెడ్డి, సతీమణి వైయస్ భారతమ్మ, వైయస్ సుధీకర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్ సౌభాగ్యమ్మలు నివాళులు అర్పించారు.

News January 25, 2025

కడప జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ అశోక్

image

కడప జిల్లా నూతన ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను శుక్రవారం కలిశారు. నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కడప కలెక్టర్ శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కలెక్టర్‌ను అడిగి ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.