News February 20, 2025

22న గద్వాలలో జాబ్ మేళా

image

గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పించుటకు 22వ తేదీన ఉదయం 11 గంటలకు బీసీ స్టడీ సర్కిల్ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్ యం.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగులు 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండి విద్యార్హత ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ ఎలక్ట్రీషియన్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నారు.

Similar News

News November 16, 2025

బలమైన లీడర్ వస్తే.. నేను రెస్ట్ తీసుకుంటా: అక్బరుద్దీన్

image

‘ప్రజాభిమానంతో నేను ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా సేవచేశా.. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి.. ఈ క్రమంలో బాగా అలసిపోయా..రెస్ట్ తీసుకుంటా..’ అని చాంద్రాయణగుట్ట MLA అక్బరుద్దీన్ మనసులోమాట వెల్లడించారు. ఓల్డ్ సిటీలో జరిగిన ఓకార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘పిల్లల అభివృద్ధి కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేశాను.. నా స్థానంలోకి ఎవరైనా బలమైన నాయకుడు వస్తే నేను తప్పుకొని ప్రశాంత జీవనం గడుపుతా’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

3Dలోనూ అఖండ-2

image

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

సంగారెడ్డి: పద్మశాలి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

image

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం సంగారెడ్డి, మెదక్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు సంగారెడ్డిలో జరిగాయి. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా జట్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్లు చింతా బలరాం, డా.గిరి, ఉపాధ్యక్షులు డా.శ్వేత, ఆంజనేయులు, యాదగిరి, ప్రధాన కార్యదర్శి వరప్రతాప్, సహాయ కార్యదర్శి అరుంధతి, వెంకటేశం, కోశాధికారి శివకుమార్ ఉన్నారు.