News February 20, 2025
22న గద్వాలలో జాబ్ మేళా

గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పించుటకు 22వ తేదీన ఉదయం 11 గంటలకు బీసీ స్టడీ సర్కిల్ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్ యం.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగులు 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండి విద్యార్హత ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ ఎలక్ట్రీషియన్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నారు.
Similar News
News November 20, 2025
నిజామాబాద్: దారుణం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం

నిజామాబాద్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన వెలుగు చూసింది. కన్న తండ్రే సొంత కూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇటీవల అర్ధరాత్రి కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడగా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
News November 20, 2025
ఎక్స్ట్రీమ్ వెదర్తో 4,064 మంది మృతి

దేశంలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది JAN-SEP వరకు 4,064 మంది మృత్యువాత పడినట్లు ఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ & ‘డౌన్ టు ఎర్త్’ నివేదిక వెల్లడించింది. గత 4 ఏళ్లతో పోలిస్తే మరణాలు 48% పెరిగినట్లు పేర్కొంది. 9.47 M హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. 2022తో పోలిస్తే 4 రెట్లు పెరిగింది. వ్యవసాయ రాష్ట్రాలైన AP, WBల సమాచారం అసమగ్రంగా ఉందని, నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చంది.
News November 20, 2025
NLG: వామ్మో కోతులు

జిల్లాలో కోతుల బెడద కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడులు గణనీయంగా తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలాకాలంగా వానరాలతో అటు రైతులు, ఇటు ప్రజలు సతమతమవుతున్నారు. రోజూ వేలాది కోతులు కూరగాయలు, పండ్ల తోటలు, పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ రైతులను ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.


