News May 18, 2024

22న నెల్లూరుకు గవర్నర్ రాక

image

వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం ఈ నెల 22న జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ హాజరుకానున్నారు. 22న ఉదయం 10.40 గంటలకు హెలికాఫ్టర్‌లో నెల్లూరులోని పోలీస్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 11.30 గంటల నుంచి 12.50 గంటల వరకు స్నాతకోత్సవంలో పాల్గొని సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

Similar News

News December 13, 2025

తిరుపతి చేరిన నెల్లూరు రాజకీయం.?

image

నెల్లూరు మేయర్ స్రవంతి అవిశ్వాస తీర్మాన ఘట్టం పొలిటికల్ హీట్ పెంచింది. 18న ఎలాగైనా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాలని మంత్రి నారాయణ, MLA కోటంరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే దాదాపు 37 మంది కార్పొరేటర్లు TDPకి మద్దతు పలుకుతుండగా వారిని తిరుపతికి తరలించినట్లు సమాచారం. జగన్ సమక్షంలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లలలో మరో ఇద్దరు TDP చెంతకు వచ్చారు. అవిశ్వాసం నెగ్గాలంటే 38 సభ్యులు కావాలి.

News December 13, 2025

నెల్లూరు: ఏడాదిపాటు లేడీ డాన్ అరుణకు నో ఛాన్స్.!

image

లేడీ డాన్ నిడిగుంట అరుణ బయటికి వస్తే మళ్లీ నేరాల బాట పట్టే అవకాశం ఉందని, అందుకే పీడీ యాక్ట్ నమోదు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ యాక్ట్ ద్వారా ఆమెకు ఏడాది పాటు బెయిల్ రాదని.. ఎవరినీ కలిసే అవకాశం ఉండదన్నారు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

News December 13, 2025

నెల్లూరు: కూతురుపై కాటు వేసిన కామాంధు తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష

image

కన్న కూతురుపై కన్నేసిన ఓ తండ్రి కామంతో కాటు వేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడు చల్లా దశరథకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధించినట్లు వింజమూరు ఎస్సై కే వీరప్రతాప్ తెలిపారు. 2020 లో వింజమూరు బీసీ కాలనీకి చెందిన దశరథ తన కూతురు‌ను బైక్‌పై ఎక్కించుకొని నేరేడుపల్లి గ్రావెల్ రోడ్డు సమీపంలో ఉన్న నిమ్మ తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.