News May 18, 2024
22న నెల్లూరుకు గవర్నర్ రాక

వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం ఈ నెల 22న జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ హాజరుకానున్నారు. 22న ఉదయం 10.40 గంటలకు హెలికాఫ్టర్లో నెల్లూరులోని పోలీస్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. 11.30 గంటల నుంచి 12.50 గంటల వరకు స్నాతకోత్సవంలో పాల్గొని సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 21, 2025
పెంచలకోనలో విశేష పూజలు

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
News December 20, 2025
నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9552300009 మనమిత్ర వాట్సాప్ సేవలను అందబాటులోకి తెచ్చిందన్నారు. ఈ-చలానా చెక్, ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్, కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు. దీని వలన ప్రజల సమయం ఆదాకావడంతోపాటు ప్రజలకు పోలీసులు మరింత చేరువవుతారు.
News December 20, 2025
పల్స్ పోలియోపై వైద్య ఆరోగ్యశాఖ అవగాహన ర్యాలీ

పోలియో కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి గుప్తా పార్కు సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా వైద్యశాఖ అధికారి సుజాత జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2,94,604 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు అందించనున్నామన్నారు. 21 నుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.


