News February 23, 2026

225 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>ESI <<>>కార్పొరేషన్‌లో 225 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి గడువును పెంచారు. మార్చి 3వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. UPSC నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2024కు సంబంధించి ప్రతిభా సేతు పోర్టల్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పే స్కేల్ రూ.56,100-రూ.1,77,500 ఉంది. వెబ్‌సైట్: https://esic.gov.in

Similar News

News February 24, 2026

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. హాల్‌టికెట్ తీసుకున్నారా?

image

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఫస్ట్, సెకండియర్ కలిపి 9,97,075 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలు కానుండగా విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలవగా.. ఇంకా తీసుకోనివారు <>tgbieht.cgg.gov.in<<>> సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతిస్తారు. ALL THE BEST

News February 24, 2026

కేరళను ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం ఆమోదం

image

కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జూన్‌లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పేరును కేరళంగా మారుస్తూ తీర్మానం చేసింది. కేంద్రం సైతం ఇదే పేరును గుర్తించాలని ప్రతిపాదించింది. ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలోని ఫస్ట్ షెడ్యూల్‌లోనూ కేరళను కేరళంగా మార్చేలా సవరణలు చేపట్టాలని కోరింది. తాజాగా దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.

News February 24, 2026

యూరప్ దేశాలకు తెలంగాణ బియ్యం!

image

TG: విదేశాలకు బియ్యం ఎగుమతులపై GOVT కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఆఫ్రికన్ దేశాలకు సోనా మసూరి, జీరా సాంబా, HMT సోనా రకం బియ్యం ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు యూరప్ దేశాల్లోనూ వీటికి డిమాండ్ పెరిగింది. అధిక నాణ్యత గల బియ్యాన్ని యూరప్ కంట్రీస్‌కూ ఎగుమతి చేయాలని నిర్ణయించింది. బియ్యం ఎగుమతుల్లో పంజాబ్‌తో పోటీ పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.