News March 20, 2025

23న వేంపల్లెకి రానున్న మాజీ సీఎం జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 23వ తేదీన వేంపల్లె పట్టణానికి రానున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చి అనంతరం వేంపల్లెలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరుకి వెళ్తారని అధికారిక సమాచారం అందింది.

Similar News

News December 22, 2025

అత్యున్నత ప్రమాణాలతో ట్రైనీ కానిస్టేబుళ్లకు శిక్షణ: SP

image

కడప జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 194 మంది సివిల్, 330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వసతులు, ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణ, నిజాయతీతోపాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి, సైబర్ నేరాల దర్యాప్తుపై పట్టు సాధించాలని సూచించారు.

News December 22, 2025

అక్షర బాటలో బాలయపల్లె ప్రాథమిక పాఠశాల ఆయమ్మ

image

కాశినాయన మండలం బాలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయాగా యంబడి బాల నాగమ్మ చాలా కాలంగా పనిచేస్తోంది. చదువంటే ఆమెకు మక్కువ కానీ పరిస్థితులు అనుకూలించక నిరక్షరాస్యురాలిగానే ఉంది. పాఠశాలలో విద్యార్థులను గమనించిన ఆమె తనకు కూడా అక్షరాలు నేర్చుకోవాలని ఉందని ఉపాధ్యాయుడు ఖాసీం వల్లికి తెలిపింది. స్పందించిన ఉపాధ్యాయుడు ఆయమ్మకి ‘రోజుకో అక్షరం’ నేర్పుతున్నారు. ఆయమ్మ సంతోషం వ్యక్తం చేసింది.

News December 22, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.13540
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12457
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2080.