News June 14, 2024

23 నుంచి నర్రవాడలో బ్రహ్మోత్సవాలు

image

దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో గురువారం పల్లకీ సేవ నిర్వహించినట్లు ఈవో ఉషశ్రీ తెలిపారు. ఆమె మాట్లాడుతూ… ప్రతి గురువారం పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు.

Similar News

News November 3, 2025

సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే తప్పా: కాకాణి

image

సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వెంకటాచలం మండలానికి చెందిన వైసీపీ నేత గోపాల్ హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతూ ఉండగా అతడిని పరామర్శించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న గోపాల్ దంపతులపై విచక్షణరహితంగా దాడి చేసి, గోపాల్ గొంతు కోశారని కాకాణి ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకే టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన అన్నారు.

News November 3, 2025

నెల్లూరు జైలుకు జోగి రమేష్‌ తరలింపు

image

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్‌, జోగి రామును నెల్లూరు జైలుకు తరలించనున్నారు. జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వారిని నెల్లూరుకు తీసుకురానున్నారు. ఓ పక్క జోగి రమేష్ అరెస్టు అన్యాయమని, అక్రమమని వైసీపీ నేతలు నిరసన చేపడుతున్నారు.

News November 3, 2025

ఒకే రోజు ఐదుగురు గల్లంతు.. నలుగురి మృతి

image

జిల్లాలో ఆదివారం విషాదం నెలకొంది. ఇందుకూరుపేట(M) మైపాడు బీచ్‌లో ముగ్గురు <<18178820>>ఇంటర్ విద్యార్థులు<<>> మృతి చెందగా, <<18180051>>కావలి(M) <<>>తుమ్మలపెంటలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవలో నుంచి కిందపడి మరొకరు మృతి చెందారు. మరోవైపు ఆత్మకూరు పట్టణ సమీపంలోని చెరువులో సాయంత్రం నలిశెట్టి <<18180051>>మహేష్<<>> గల్లంతయ్యాడు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు.