News May 25, 2024
23 రౌండ్లలో మండపేట ఓట్ల లెక్కింపు.. ఫలితం ఆలస్యం!

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఓట్లు లెక్కింపుపై సర్వత్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ అభ్యర్థి గెలుస్తారు..? ఫలితాలు ఏ పార్టీ వైపు ఉంటాయి..? అనే చర్చ నడుస్తుంది. అయితే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీలో జరగనుంది. మండపేట ఓట్లను 23 రౌండ్లలో లెక్కిస్తారు. దీంతో లెక్కింపునకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Similar News
News November 2, 2025
తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా

కార్తీక మాసం కారణంగా తాళ్లపూడి మండలంలో మాంసం విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆదివారం నాటికి కిలో చికెన్ రూ.200-220 పలుకుతుండగా, నాటుకోడి రూ.600, మేక మాంసం రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు గణనీయంగా తగ్గడంతో వ్యాపారం మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయగలరు.
News November 1, 2025
పుష్కర కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

గోకవరం మండలం తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్ప భగవాన్ (35) పుష్కర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2025
వృద్ధుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుని ఇంటికి వెళ్లి కలెక్టర్ తన చేతుల మీదుగా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మూర్తి, ఏడీ శశిబిందు, ఎంపీడీవో అశోక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.


