News May 25, 2024

23 రౌండ్లలో మండపేట ఓట్ల లెక్కింపు.. ఫలితం ఆలస్యం!

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఓట్లు లెక్కింపుపై సర్వత్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ అభ్యర్థి గెలుస్తారు..? ఫలితాలు ఏ పార్టీ వైపు ఉంటాయి..? అనే చర్చ నడుస్తుంది. అయితే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీలో జరగనుంది. మండపేట ఓట్లను 23 రౌండ్లలో లెక్కిస్తారు. దీంతో లెక్కింపునకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Similar News

News February 10, 2025

రాజమండ్రి: బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ.. ట్రాఫిక్ జామ్

image

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ కొట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో సుమారు రెండు గంటలు పాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు బ్రిడ్జిపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సిబ్బంది సకాలంలో చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

News February 10, 2025

అనపర్తిలో పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

image

అనపర్తిలో ఓ యువకుడు పెళ్లైన ఏడాదికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI శ్రీను తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సాయి సాకేత్‌రెడ్డి కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. శనివారం పురుగుమందు తాగగా.. బంధువులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

News February 10, 2025

ఫ్లైట్ డోర్ తెరిచిన రాజమండ్రి ప్రయాణికుడు

image

విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడిపై కోరుకొండ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్యామ్ సుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం శనివారం రాత్రి మధురపూడి విమానాశ్రయానికి వచ్చింది. ల్యాండ్ అయిన తరువాత రాజమండ్రికి చెందిన ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో విమానం వెళ్లడానికి జాప్యం జరిగింది.

error: Content is protected !!