News October 16, 2025
23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ: కలెక్టర్

విద్యార్థుల ఆధార్ నవీకరణకు ఈనెల 23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ ప్రారంభిస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 110 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 80 కేంద్రాలు పని చేయడంతో వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 16, 2025
HYD: ఆన్లైన్లో అమ్మాయి.. మోసపోయిన అబ్బాయి!

ఆన్లైన్ డేటింగ్, ఫ్రెండ్షిప్ స్కామ్లో పడ్డ వ్యక్తి రూ.6,49,840 పోగొట్టుకున్నాడు. మలక్పేట్కు చెందిన వ్యక్తి (32)కి డేటింగ్ సైట్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. పెళ్లి కుదురుస్తామని మాట్లాడి కొంత డబ్బు తీసుకుంది. అనంతరం ఓ ఫ్రెండ్షిప్ గ్రూప్లో యాడ్ చేసింది. అందులో ఉన్నవారి సూచనల మేరకు బాధితుడు విడతల వారీగా రూ.6,49,840 చెల్లించాడు. తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
News October 16, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: కలెక్టర్

పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధర పొందాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మార్కెటింగ్, వ్యవసాయ, ఫైర్, విద్యుత్, జిన్నింగ్ మిల్ యాజమాన్యం వారితో గురువారం సమీక్షించి వారు మాట్లాడారు. జిల్లాలో మొత్తం 1,26,119.35 ఎకరాల్లో పత్తి సాగు అయ్యిందని, 1,38,731.285 టన్నుల పత్తి ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారన్నారు.
News October 16, 2025
కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. ఎన్నికల అధికారిగా జగిత్యాల జిల్లా సహకార అధికారి సి.హెచ్.మనోజ్ కుమార్ను నియమించింది. సకాలంలో జరగాల్సిన ఎన్నికలు వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించి నివేదిక సమర్పించాలని అథారిటీ ఆదేశించింది.