News August 18, 2025
EPFOలో 230 ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి. <
Similar News
News August 18, 2025
సుభాష్ చంద్రబోస్.. జననం తప్ప మరణం లేని యోధుడు!

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన జాతీయవాద నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1897 JAN 23న ఒడిశాలో జన్మించారు. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అని యువతను ఉత్తేజపరిచి ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించి బ్రిటిషర్లకు చుక్కలు చూపించారు. 1945 ఆగస్టు 18న బోస్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినప్పటికీ ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
News August 18, 2025
ఫ్రీ బస్సు.. నేటి నుంచి జాగ్రత్త

AP: ఉచిత బస్సు పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. నేటి నుంచి విద్యాసంస్థలు, కార్యాలయాలు తెరుచుకోవడంతో రద్దీ భారీగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బస్సులు ఎక్కేటప్పుడు కంగారు పడొద్దని, డ్రైవర్లు, కండక్టర్లకు సహకరించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే మహిళలకు సూచించారు. గత శుక్రవారం ఈ స్కీమ్ ప్రారంభించగా నిన్న రాత్రి 8 గం. వరకు 13.30 లక్షల మంది మహిళలు ప్రయాణించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
News August 18, 2025
ఈ రకమైన వాకింగ్ ట్రై చేశారా?

వాకింగ్ రకాల్లో బ్రిస్క్ వాకింగ్ ఒకటి. ఇందులో సాధారణం కంటే ఎక్కువ వేగంతో నడుస్తూ చేతులను లయబద్ధంగా ఆడించాల్సి ఉంటుంది. నిమిషానికి 100 స్టెప్పులు లేదా గంటకు 7.24 కి.మీ నడవాల్సి ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని డాక్టర్లు తెలిపారు. ఎక్కువ మొత్తంలో కెలోరీలు బర్న్ అయి బరువు తగ్గుతారని, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని పేర్కొన్నారు. ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయన్నారు.