News June 22, 2024

24న ఒంగోలులో ‘మీకోసం’ కార్యక్రమం

image

ఒంగోలులోని స్పందన హాలు, కలెక్టర్ ఆఫీసు కార్యాలయాలలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు “మీకోసం” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు తమ సమస్యలను అధికారులకు అర్జీల ద్వారా తెలియచేయ వచ్చునని పేర్కొన్నారు. అధికారులు సదరు కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.

Similar News

News December 23, 2025

ప్రకాశం జిల్లాలో యూరియాకై ప్రణాళిక సిద్ధం

image

ప్రకాశం జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 34878 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాకు మొత్తం 23115 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికీ 31872 పెళ్లి టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందని డిసెంబర్‌కు 350 మెట్రిక్ టన్నులు రానుందన్నారు.

News December 23, 2025

ప్రకాశం: బిడ్డ మోసానికి.. RDO న్యాయం

image

కన్న బిడ్డ మోసం చేస్తే.. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న ఆ తల్లికి న్యాయం చేశారు. ముండ్లమూరు మండలం కొమ్మవరానికి చెందిన రమాదేవికి ఒక కుమారుడు ఉన్నారు. కాగా రమాదేవి పేరుమీద ఉన్న 1.96 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె మృతి చెందినట్లు తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి వేరొకరికి ఆ భూమి విక్రయించాడు. రమాదేవి దీనిపై RDOకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఆర్డీవో విక్రయాన్ని రద్దుచేసి సహకరించిన అధికారులపై చర్యలకు ఆదేశించారు.

News December 23, 2025

మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలి: కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్న భోజనం అమలుకు సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజాబాబు అధ్యక్షత నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం నూరు శాతం అమలుజరగడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని, నాణ్యత లోపాలు లేకుండా చూడాలన్నారు.