News June 22, 2024

24న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ: గుంటూరు కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్, డివిజన్ స్థాయి అధికారులు సంబంధిత సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎమ్మార్వోలను ఆదేశించారు.

Similar News

News November 19, 2025

GNT: 26న జెడ్పీ స్థాయి సంఘ సమావేశం

image

జిల్లా పరిషత్ 6వ స్థాయి సంఘ సమావేశాన్ని ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ ముఖ్య కార్య నిర్వహణాధికారి వి. జ్యోతిబాసు తెలిపారు. ఉదయం 10:30 నుంచి ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఛాంబర్‌లో జిల్లా పరిషత్ వైస్ ఛైర్‌పర్సన్ అనురాధ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశం జరుగుతుందన్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, తదితర అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు.

News November 19, 2025

వెంకటపాలెం: సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీన రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్న విషయం తెలిసిందే. కలెక్టర్ తమీమ్ అన్సారీయా, ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులతో చర్చించారు.

News November 19, 2025

GNT: తెలుగు సాహితీవేత్త మద్దిపట్ల సూరి సేవలు అజరామరం

image

సాహిత్య విమర్శకుడు మద్దిపట్ల సూరి తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగంలో సుపరిచితుడు. 1916, జులై 7న తెనాలి సమీపంలో ఆయన జన్మించారు. తెలుగు అకాడమీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా కీలక సేవలు అందించారు. అకాడమీ ద్వారా తెలుగులో విజ్ఞాన, శాస్త్ర సంబంధిత గ్రంథాల ప్రచురణకు ఆయన విశేష కృషి చేశారు. సూరి తెలుగు భాషాభివృద్ధికి, విద్యా సంబంధిత పుస్తకాల విస్తరణకు తమ జీవితాన్ని అంకితం చేశారు. 1995 నవంబర్ 19న మరణించారు.