News July 23, 2024

24న YVUలో జాబ్ మేళా..

image

యోగివేమన విశ్వవిద్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైవీయూ ప్లేస్మెంట్ సెల్ సంచాలకులు ఆచార్య ఎల్.వి.రెడ్డి తెలిపారు. టీసీఎల్, అపోలో ఫార్మసీ కంపెనీలు దాదాపు 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వస్తున్నట్లు తెలిపారు. టీసీఎల్ కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు కావాలన్నారు. ఫార్మా కంపెనీలలో ఉద్యోగాల కోసం బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, పీహెచ్డీ చేసినవారు అర్హులన్నారు.

Similar News

News October 27, 2025

అత్యవసరమైతే 112‌కు ఫోన్ చేయండి: ఎస్పీ

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యలకు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ నచికేత్ ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంలో మూడు రెస్క్యూ టీంలతోపాటు ప్రతి పోలీస్ సబ్ డివిజన్‌కు ఒక టీం సిద్ధంగా ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు దాటరాదని, ఎలాంటి సహాయక చర్యలు అవసరమైన వెంటనే 112కు ఫోన్ చేసి తెలిపితే, సహాయక చర్యలకు తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు.

News October 26, 2025

జమ్మలమడుగులో భార్యాభర్తలు దారుణ హత్య

image

జమ్మలమడుగు- తాడిపత్రి రహదారిలో శ్రీకృష్ణ మందిరం సమీపంలో ఇటికల బట్టి వద్ద కాపలాగా ఉన్న నాగప్ప పెద్దక్క అనే దంపతులపై శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. దాడులు చేయడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులను చోరీ చేశారు. ఇది దొంగల పనేనని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 26, 2025

కడప జిల్లా ప్రజలకు గమనిక

image

కడప జిల్లాలో వాతావరణ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఆదితి సింగ్ ఆదివారం తెలిపారు. విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాటిని వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.