News December 6, 2024

24వ తేదీ లోపు క్లెయిమ్స్, పరిష్కరించాలి: కలెక్టర్

image

నవంబర్ 28వ తేదీ వరకు తీసుకున్న క్లెయిమ్స్, అభ్యంతరాలను ఈనెల 24వ తేదీ లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా ఈఆర్ఓలు, తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి స్పెషల్ సమ్మరీ రివిజన్-2025పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు త్వరలో రోల్ అబ్జర్వర్ వచ్చే అవకాశం ఉందని, ఇందుదకు సంబంధించిన రికార్డులన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

Similar News

News January 16, 2025

కర్నూలు జిల్లాలో అనిల్ అంబానీ భారీ పెట్టుబడి!

image

కర్నూలు జిల్లాకు మరో భారీ పెట్టుబడి రానుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కర్నూలులో కాంపోజిట్ ఫెసిలిటీపై రూ.10వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే జిల్లాలో అనువైన భూములను పరిశీలించినట్లు సమాచారం. త్వరలోనే ఒక ప్లేస్‌ను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచే సుమారు 6వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

News January 16, 2025

డ్రోన్ ఎగిరిందనే నెపంతో దాడి: కాటసాని

image

YCP నేత మహమ్మద్ ఫైజ్ కుమారుడి వివాహ వేడుకలను చిత్రీకరిస్తున్న డ్రోన్ కెమెరా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై ఎగిరిందనే కారణంతో బుధవారం రాత్రి బీసీ అనుచరులు ఫైజ్ కుటుంబం, డ్రోన్ ఆపరేటర్లపై దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎస్ఐ దుగ్గిరెడ్డికి ఫిర్యాదు చేశారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఇంట భయభ్రాంతులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News January 16, 2025

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అవుతుందని, వెంటనే apk ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయమంటూ వచ్చే మెసేజులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. మీరు కూడా ఎంతో తేలికగా ఆ గేమ్ ఆడి డబ్బులు సంపాదించవచ్చు అనే ప్రకటనలు చూసి మోసపోవద్దన్నారు. నేరాలపై 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.