News May 20, 2024
24నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో సుభద్ర చెప్పారు. 24న తెలుగు, కాంపోజిట్ కోర్సు, 25న ద్వితీయ భాష హిందీ, 27న ఇంగ్లీషు, 28న గణితం, 29న ఫిజికల్ సైన్స్, 30న బయాలాజికల్ సైన్స్, 31న సోషల్ స్టడీస్, జూన్ 1న కాంపోజిట్ కోర్సు సేవం- ఓఎస్ఎన్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, జూన్ 3న ఓఎస్ఎన్ సీ మెయిన్ పరీక్ష జరుగుతుందన్నారు.
Similar News
News October 28, 2025
ప్రకాశం జిల్లాలో పునరావాసాలకు 2900 మంది

తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2900 మందిని తరలించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టరేట్లో మాట్లాడుతూ.. ఒంగోలు నగరంలో 30 లోతట్టు కాలనీలను గుర్తించామని, కోస్తా మండలాల్లో 10 లోతట్టు ఆవాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 2 రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ప్రకాశం: ‘గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

గర్భవతులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల గర్భవతులు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ తేదీకంటే ముందుగానే హాస్పిటల్లో చూపించుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంగన్వాడీలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ప్రకాశం: జాతీయ రహదారులపై రాకపోకలు నిషేధం

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలను రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు SP హర్షవర్ధన్ రాజు ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వాహనాల ప్రయాణం నిషేధించడం జరిగిందని, ప్రజా రక్షణ నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని వాహనదారులు పాటించాలని ఎస్పీ సూచించారు.


