News March 19, 2025

24 నుంచి జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్: ASF ఎస్పీ

image

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ గ్రామాల నుంచి ఒక టీంను ఎంపిక చేసుకోవాలన్నారు. శనివారం లోపు 8466943511 నెంబర్‌కు తెలుపాలన్నారు.

Similar News

News February 23, 2026

తెలంగాణ ఉద్యమకారులకు గుడ్ న్యూస్

image

TG: తెలంగాణ సాధనలో పోరాడిన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తమకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫున లాయర్ కరుణాకర్ రెడ్డి వాదించారు. అభయహస్తం స్కీం కింద అప్లై చేసిన వీరికి 8వారాల్లో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పు ఇచ్చారు.

News February 23, 2026

అమరావతిలో రూ.40,887 కోట్లతో ట్రంక్ రోడ్లు

image

AP: అమరావతిలో రూ.40,887 కోట్లతో ప్రభుత్వం ట్రంక్ రోడ్ల నిర్మాణం చేపడుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది. ఇందులో భాగంగా IRRను 96 KM మేర 8+4గా నిర్మించనున్నారు. 26 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. 2027 నాటికి ఇది పూర్తవుతుంది. కాగా రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ.18,779 కోట్లతో టెండర్లు కూడా పిలిచామని మంత్రి నారాయణ ఇటీవల అసెంబ్లీలో తెలిపారు.

News February 23, 2026

రేపు కుమ్మెరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక

image

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం కుమ్మెర గ్రామానికి రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రానున్నారు. ఇటీవల కులవివక్షకు గురైన బాధితులను ఆయన పరామర్శిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు.