News October 15, 2025

24 గంటల్లో ధాన్యం మిల్లులకు తరలించాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన ధాన్యాన్ని 24 గంటల్లో మిల్లులకు తరలించాలన్నారు. అకస్మాత్తు వర్షాల దృష్ట్యా టార్ఫాలిన్‌లు సిద్ధంగా ఉంచాలని, హమాలీల కొరత లేకుండా చూడాలని సూచించారు. నవంబర్ చివరివరకు జిల్లాలో 2 లక్షల MTల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యంగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 16, 2025

నారాయణపేట: హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్: ఎస్ఐ

image

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మగ్దంపూర్ గ్రామానికి చెందిన రుక్కమూల నరసింహులుపై కత్తితో దాడి చేసిన జంజర్ల నరేశ్(25)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 10వ తేదీన “తన కూతురితో ఎందుకు మాట్లాడుతున్నావు” అని నరసింహులు ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన నరేశ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకుని జిల్లా జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు SI రమేశ్ తెలిపారు.

News October 16, 2025

వనపర్తిలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం

image

వనపర్తిలోని ఓ కాలేజీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లాకు చెందిన పోతులపాడు సంజీవ (16) వనపర్తిలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఈనెల 10న మధ్యాహ్నం కాలేజీ నుంచి ఆ విద్యార్థి ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.

News October 16, 2025

గద్వాల: కరెంట్ షాక్‌తో మహిళ మృతి

image

గద్వాల పట్టణంలోని బీసీ కాలనీలో దుర్గమ్మ (30) అనే మహిళ కరెంట్ షాక్‌తో బుధవారం మృతిచెందిందని స్థానికులు తెలిపారు. భర్త ఎల్లప్పతో కలిసి దుర్గమ్మ గతంలో నంద్యాల నుంచి గద్వాలకు బతుకుదెరువు నిమిత్తం వచ్చిందని చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.