News March 21, 2024

24, 25న తుంబురుతీర్థ ముక్కోటి

image

తిరుమల శ్రీతుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24, 25న జరుగనుంది. తీర్థానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. తుంబురు తీర్థంలోకి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు.. మ‌రుస‌టి రోజు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్ర‌మే భక్తులను అనుమతిస్తారు.

Similar News

News February 5, 2025

కుప్పం: రహదారుల అభివృద్ధికి రూ.53.35 కోట్లు మంజూరు

image

కుప్పం నియోజకవర్గంలో ఆర్ అండ్ బి ద్వారా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. నియోజకవర్గంలో 23 రహదారుల అభివృద్ధి కోసం ఆర్‌ఐడిఎఫ్ గ్రాంట్ కింద రూ.53.35 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిరత్నం, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని 23 రహదారులను అభివృద్ధి చేయనున్నారు.

News February 4, 2025

కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి రూ.7.85 కోట్లు

image

శాంతిపురం (M) రాళ్లబూదుగూరులో నెలకొని ఉండు శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.7.85 కోట్లను మంజూరు చేసింది. కుప్పం ప్రాంతంలో అత్యంత పురాతన ఆలయంలో ఒకటైన శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడం పట్ల స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

News February 3, 2025

కుప్పంలో పట్టపగలు వరుస చోరీలు

image

కుప్పం పట్టణంలో మధ్యాహ్నం రెండిళ్లలో వరుస చోరీలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి రెండిళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. టీబీ రోడ్డు సమీపంలోని ఓ వైసీపీ నేత ఇంట్లో బీరువాను పగలగొట్టి చోరీ చేయడంతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ను దొంగ ఎత్తుకెళ్లాడు. అదేవిధంగా ప్యాలెస్ ఏరియాలో సైతం ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.

error: Content is protected !!