News July 22, 2024

హరియాణాలో 24గంటలు ఇంటర్నెట్ బంద్

image

హరియాణాలో నేడు జరగనున్న బ్రజ్ మండల్ జలాభిషేక్ యాత్ర దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. గత ఏడాది జులై 31న ఇదే యాత్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు హోంగార్డులు మరణించారు. ఈ నేపథ్యంలో నేటి యాత్రకు భారీగా భద్రతాబలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో నిఘా వేయనున్నాయి. దుష్ప్రచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకే నెట్ ఆపేసినట్లు ప్రభుత్వం వివరించింది.

Similar News

News December 3, 2025

జనాభా పెంచేలా చైనా ట్రిక్.. కండోమ్స్‌పై ట్యాక్స్!

image

జననాల రేటు తగ్గుతుండటంతో చైనా వినూత్న నిర్ణయం తీసుకుంది. కొత్తగా కండోమ్ ట్యాక్స్ విధించనుంది. జనవరి నుంచి కండోమ్ సహా గర్భనిరోధక మందులు, పరికరాలపై 13% VAT విధించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు పిల్లల సంరక్షణ, వివాహ సంబంధిత సేవలపై వ్యాట్ తొలగిస్తోంది. కాగా 1993 నుంచి కండోమ్స్‌పై అక్కడ వ్యాట్ లేదు.

News December 3, 2025

APPLY NOW: 252 అప్రెంటిస్ పోస్టులు

image

<<-1>>RITES<<>>లో 252 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ, BE, B.Tech, బీఆర్క్, డిప్లొమా, ITI ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 146 ఉండగా.. డిప్లొమా అప్రెంటిస్‌లు 49, ITI ట్రేడ్ అప్రెంటిస్‌లు 57 ఉన్నాయి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.rites.com/

News December 3, 2025

రూ.2లక్షలు క్రాస్ చేసిన KG వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండిపై రూ.5వేలు పెరిగి చాలారోజులకు రూ.2లక్షల మార్కును దాటింది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు రూ.2,01,000గా ఉంది. అటు 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,30,580గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.650 ఎగబాకి రూ.119700 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.