News September 12, 2025

శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 66,312 మంది దర్శించుకోగా.. 27,728 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారిని దర్శించుకున్నారు.

Similar News

News September 12, 2025

ఏ సమయంలో ఏ మంత్రం చదవాలంటే?

image

ఆర్థిక సమస్యలు వేధించినప్పుడు: కనకధార స్తోత్రం
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు: దుర్గా సప్తశతి
శక్తి సన్నగిల్లినప్పుడు: హనుమాన్ చాలీసా
కుటుంబ కలహాలు ఉన్నప్పుడు: గణేశ అథర్వశీర్షం
న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు: సుందరకాండ
మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు: శివాష్టకం
మార్గం తప్పినట్లు అనిపించినప్పుడు: విష్ణు సహస్రనామం

News September 12, 2025

వరి, మొక్కజొన్నలో విత్తనశుద్ధి

image

☛ వరి: పొడి విత్తనశుద్ధిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి మండె కట్టి నారుమడిలో చల్లాలి. మొక్కజొన్న: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేయడం వల్ల మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు.

News September 12, 2025

గర్భిణులు ఎలా పడుకోవాలంటే..

image

ప్రెగ్నెన్సీలో ఎడమ పక్కకి పడుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల కడుపులోని బిడ్డకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వ్యర్థ పదార్థాలు కూడా మూత్రాశయాన్ని చేరుకోవడం సులభమవుతుంది. కాళ్లు, చేతుల వాపు తగ్గుతుంది. మూడో త్రైమాసికంలో సరైన నిద్ర కోసం దిండ్లను ఉపయోగించవచ్చు. దీంతో పాటు మెటర్నటీ బెల్ట్, నైట్ బ్రా కూడా మంచి నిద్రకు సహకరిస్తాయి. పడుకోవడానికి కనీసం గంట ముందే డిన్నర్ పూర్తి చేయాలి.