News June 23, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన కంపార్ట్‌మెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 74,467 మంది దర్శించుకున్నారు. 40,005 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు లభించింది.

Similar News

News December 8, 2025

ఇండిగో అంశం కేంద్రం పరిధిలోనిది: చంద్రబాబు

image

AP: ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేశ్ మానిటర్ చేస్తున్నారని ఇటీవల ఓ టీవీ డిబేట్‌లో టీడీపీ MLC దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి.

News December 8, 2025

10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

image

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

News December 8, 2025

కేంద్ర ఉద్యోగులకు వేతన సవరణ ఆలస్యమేనా!

image

7వ PRC గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. 2026 JAN నుంచి 8వ PRC అమలు కావాలి. ఈ కమిషన్‌ను కేంద్రం ఈ ఏడాది JANలో వేసినా టర్మ్స్‌ను NOVలో కానీ ప్రకటించలేదు. కాగా PRCపై LSలో MPలు ప్రశ్నించగా ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటినుంచి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కమిషన్ నివేదికకు 18 నెలల సమయం పడుతుంది’ అని మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దీంతో కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్న PRC అమలు ఆలస్యం కావొచ్చంటున్నారు.