News March 23, 2024

25న రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

image

భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేకం మహోత్సవం జరగనున్నాయి. ఈనెల 25న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచుతారు. తలంబ్రాలు కలిపే క్రతువును ప్రారంభిస్తారు. అదే రోజు హోలీ కావడంతో వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.

Similar News

News December 10, 2025

26 లోపు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

image

పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. థియరీకి టెన్త్‌కు రూ.100, ఇంటర్‌కు రూ.150 ఫీజుగా నిర్ణయించారు. తత్కాల్ స్కీంలో అదనంగా టెన్త్‌కు రూ.500, ఇంటర్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

News December 10, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

News December 10, 2025

టీడబ్ల్యుజేఎఫ్ ఖమ్మం జిల్లా అడ్హక్ కమిటీ ఏకగ్రీవం

image

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అడ్హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్‌గా టి. సంతోష చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అల్లపల్లి నగేశ్, అంతటి శ్రీనివాస్, నంద బాల రామకృష్ణ, వందనపు సామ్రాట్‌‌ను ఎన్నుకున్నారు. నూతన నాయకత్వం మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని, వారి హక్కుల కోసం కృషి చేస్తామని తెలియజేశారు.