News June 4, 2024

25 వేల + ఓట్ల మెజార్టీతో యరపతినేని గెలుపు

image

గురజాల కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమీప ప్రత్యర్థి కాసు మహేశ్ రెడ్డి‌పై 25వేల + ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1994 నుంచి రాజకీయాలలో ఉన్న యరపతినేని గురజాల కు ఒకే పార్టీ నుండి నుంచి ఏడు సార్లు పోటీ చేసి రికార్డ్ సృష్టించారు. తాజా గెలుపుతో ఆయన నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Similar News

News December 9, 2025

గుంటూరు NHM–NTEP పోస్టుల ఎంపిక జాబితా విడుదల

image

గుంటూరు జిల్లాలో ఎయిడ్స్, టి.బి విభాగంలో ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా DMHO విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వారు డిసెంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు అసలు సర్టిఫికెట్లతో గుంటూరు DMHO కార్యాలయంలో అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపిక జాబితా జిల్లా అధికారిక వెబ్‌సైట్ guntur.ap.gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు.

News December 9, 2025

గుంటూరు NHM–NTEP పోస్టుల ఎంపిక జాబితా విడుదల

image

గుంటూరు జిల్లాలో ఎయిడ్స్, టి.బి విభాగంలో ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా DMHO విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వారు డిసెంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు అసలు సర్టిఫికెట్లతో గుంటూరు DMHO కార్యాలయంలో అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపిక జాబితా జిల్లా అధికారిక వెబ్‌సైట్ guntur.ap.gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు.

News December 9, 2025

ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్: మంత్రి అనగాని

image

రెవెన్యూ సమస్యలపై ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం సచివాలయంలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి సమయం పడుతోందని, రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తిస్థాయి మార్పులతో తప్పులకు ఆస్కారం లేని వ్యవస్థను తీసుకువస్తామన్నారు. రైతులకు త్వరగా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.