News October 26, 2025
25 ప్రైవేట్ బస్సులకు భారీగా జరిమానా: RTO

కర్నూలు(D) జిల్లా బస్సు దుర్ఘటన నేపథ్యంలో శనివారం రాత్రి తిరుపతి జిల్లా వ్యాప్తంగా RTA అధికారులు తనిఖీలు చేపట్టారు. RTO మురళీమోహన్ నిబంధనలు పాటించని 25 బస్సులపై కేసులు నమోదు చేశారు. అగ్ని మాపక నియంత్రణ పరికరాలు లేనివి 5, సరుకు రవాణా చేస్తున్న వాహనాలు 6, అనధికార సీటింగ్ మార్పిడిపై కేసులు నమోదయ్యాయన్నారు. మొత్తం రూ.3లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
NZB: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్లో ప్రేమలో విఫలమైందని ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణం చెందినట్లు నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలం గొల్లపల్లికి చెందిన ఆకాష్ NZBలోని ఓ మాల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తూ వినాయక్ నగర్లో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న యువతితో ప్రేమాయణం కొనసాగించాడు. ప్రేమ విషయం వారి ఇంట్లో తెలిసి గొడవలు జరగాయి. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
News October 26, 2025
పిక్నిక్ స్పాట్గా రేవు పోలవరం

కార్తీక మాసం వచ్చిందంటే అందరి చూపులు రేవు పోలవరం వైపే ఉంటాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో రేవు పోలవరం పిక్నిక్ స్పాట్గా గుర్తింపు పొందింది. విశాలమైన సముద్ర తీరం, దానికి అనుకుని పురాతనమైన రాధా మాధవ స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సముద్రం మధ్యలో నిర్మించిన జెట్టి, కొబ్బరి తోటలతో ఆహ్లాదకరమైన వాతావరణ కనువిందు చేస్తాయి. దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి ఆనందంగా గడిపి వెళుతుంటారు.
News October 26, 2025
కేయూలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ఫీజులు ఇవే..!

కేయూలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సామాజిక వర్గాల వారీగా హాస్టల్స్ డిపాజిట్లను నిర్ణయించారు. ఓసీ కేటగిరీ అభ్యర్థులు రూ.12,200, బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.10,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.8,200 చెల్లించాల్సి ఉంది. అన్ని కేటగిరీలకు చెందిన దివ్యాంగులు ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదని డైరెక్టర్ తెలిపారు.


