News April 12, 2025
25 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

భారత సైన్యంలో అగ్నిపథ్ ద్వారా అగ్నీవీర్ నియామకాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఏప్రిల్ 25 వరకు పెంచినట్లు గుంటూరు రిక్రూటింగ్ కార్యాలయం తెలిపింది. జూన్లో జరిగే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 13 భాషల్లో, వాటిలో తెలుగులోనూ నిర్వహించనున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం సహా పలు జిల్లాల అభ్యర్థులు అగ్నీవీర్ టెక్నికల్, జీడీ, ట్రేడ్స్ మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News December 22, 2025
శ్రీకాకుళం: పోలియో సిరా చుక్క..ఎందుకంటే?

శ్రీకాకుళం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం 93% పూర్తయినట్లు వైద్యాధికారులు నేడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 0-5 ఏళ్లున్న చిన్నారులకు రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేసినంతరం ఎడమచేతి చిటికెల వేలుకు చుక్క పెడతారు. దీనికి కారణమేంటంటే..మరొక కేంద్రానికి వెళ్లకుండా, పోలియో చుక్కలు దుర్వినియోగం కాకుండా ఈ విధానం కొనసాగిస్తున్నారు. గతంలో సిరా పెట్టేవారు. ప్రస్తుతం పర్మినెంట్ మార్కర్ పెన్ వాడుతున్నారు.
News December 22, 2025
కడప కలెక్టరేట్ వద్ద సర్పంచుల నిరసన: శివచంద్రారెడ్డి

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
News December 22, 2025
నల్గొండ: సర్పంచ్ల ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం

కొత్త సర్పంచ్లు, వార్డు సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1,779 జీపీలకు కొత్త పాలక వర్గాలను ఎన్నుకున్నారు. వారి ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో జీపీ కార్యాలయాల్లో పండుగ వాతవరణం నెలకొంది.


