News January 2, 2025
ఒకే మ్యాచ్లో 25 సిక్స్లు

శ్రీలంకతో జరిగిన మూడు T20ల సిరీస్ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన 3వ మ్యాచ్లో శ్రీలంక 7 పరుగుల తేడాతో గెలుపొందినా తొలి 2 మ్యాచ్లు గెలిచిన న్యూజిలాండ్ కప్ దక్కించుకుంది. కాగా, 3వ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు విరుచుకుపడగా 25 సిక్సులు నమోదయ్యాయి. శ్రీలంక 218 రన్స్, న్యూజిలాండ్ 211 పరుగులు చేశాయి. శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా 44బంతుల్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 22, 2025
పాపాల నుంచి విముక్తి కోసం..

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాప భయాపహమ్ ||సమస్త లోకాలకు ఆధారభూతుడైన, ఏకైక ప్రభువైన విష్ణుమూర్తి వేయి నామాలను తప్పక ఆలకించాలని భీష్మాచార్యుల వారు ఉద్బోధించారు. ఈ పవిత్ర నామాలను శ్రద్ధతో వినడం వలన పాప కర్మలు, జన్మ,మృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. శాశ్వత శాంతిని, సకల శుభాలను పొందడానికి విష్ణు సహస్ర నామ పారాయణ సులభమైన మార్గమంటారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 22, 2025
GREAT: బ్యాగులో రూ.10,00,000.. అయినా పైసా ముట్టలేదు!

పుణే(MH)కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే గొప్ప మనసు చాటుకున్నారు. గురువారం చెత్త ఏరుతుండగా ఆమెకు ఓ బ్యాగ్ దొరికింది. అందులో డబ్బు, మెడిసిన్లు కనిపించాయి. అది ఎవరిదో కనుక్కునేందుకు ఆ వీధి అంతా తిరిగింది. ఓ వ్యక్తి టెన్షన్తో కనిపించడంతో అతడికి వాటర్ ఇచ్చింది. బ్యాగ్ దొరికిందని ఇచ్చేసింది. అందులో రూ.10 లక్షల క్యాష్ ఉంది. దీంతో ఆమె నిజాయతీకి మెచ్చిన బ్యాగ్ యజమాని చీర, కొంత డబ్బు ఇచ్చాడు.
News November 22, 2025
ఈ నెల 25 నుంచి 17వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

దక్షిణాసియాలోనే అతిపెద్ద 17వ పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన ఈ నెల 25-28 వరకు HYDలోని HICCలో జరగనుంది. దీనికి 1,500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 50 దేశాల నుంచి 500లకు పైగా ఎగ్జిబిటర్లు, 40 వేలకు పైగా సందర్శకులు హాజరుకానున్నారు. పౌల్ట్రీరంగంలో సమస్యలు, AI, ఆటోమేషన్, ఉపాధి వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు హాజరుకావాలని CM రేవంత్రెడ్డికి నిర్వాహకులు ఆహ్వానం అందించారు.


