News February 13, 2025

26న పోలింగ్ సామాగ్రి పంపిణీ: కలెక్టర్

image

కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ప్రిసైడింగ్ అధికారులు, కమిషనర్లు, ఎంపీడీవోలు, తాహశీల్దార్లు, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. 26న ఏసీ కళాశాలలో పోలింగ్ కేంద్రాల సామాగ్రిని అందిస్తామని చెప్పారు.

Similar News

News March 23, 2025

తుళ్లూరు: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 31 తేదీన అమరావతి రాజధాని ప్రాంతంలో పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆర్డిఓ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న పనులు పరిశీలించి అధికారులకు ఆమె సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, డీఎస్పీ పాల్గొన్నారు.

News March 23, 2025

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు

image

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు మారుతోంది. ఈ గాల్లో ఎగిరే టాక్సీలను తయారు చేస్తున్న సంస్థ పేరు మ్యాగ్నమ్ వింగ్స్. గుంటూరు నల్ల చెరువులో చావా అభిరాం అనే వ్యక్తి ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నాడు. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నారు. తక్కువ ఖర్చుతో ఈ ఎయిర్‌ ట్యాక్సీలో ప్రయాణం చేసేలా రూపొందిస్తున్నారు.

News March 23, 2025

పెదకాకాని: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

image

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. దీంతో రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

error: Content is protected !!