News April 25, 2024
26న స్క్రూటినీ ప్రక్రియకు హాజరు అవ్వండి: జేసీ

ఈ నెల 26న జరిగే నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియకు రాజకీయ పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలని పాణ్యం రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News October 18, 2025
జిల్లాలో ప్రధాని పర్యటన విజయవంతం: కలెక్టర్

జిల్లాలో ప్రధానమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులు, సిబ్బందిని కలెక్టర్ డా. సిరి అభినందించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. పర్యటనలో సీపీవో, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, డీఆర్వో, పారిశుద్ధ్య, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు సమర్థవంతగా వ్యవహరించారని తెలిపారు. పర్యటనలో ఒక అబ్బాయి మరణించడం దురదృష్టకరమని అన్నారు.
News October 18, 2025
ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగిందేంటి?: ఎస్వీ మోహన్ రెడ్డి

ప్రధాని మోదీ కర్నూలు, శ్రీశైలం పర్యటనకు రూ.300 కోట్లు ఖర్చు చేసిన సీఎం చంద్రబాబు, రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేయించుకోలేదని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కర్నూలుకు మంజూరైన హైకోర్టు, లా యూనివర్సిటీని అమరావతికి తరలించడం దుర్మార్గమని మండిపడ్డారు.
News October 18, 2025
మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఏ–క్యాంపు మున్సిపల్ పార్కులో జిల్లా కలెక్టర్ సిరి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి వాడ, ప్రతి కాలనీలో పచ్చదనం విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.