News April 25, 2024

26న తిరుమలకు ఉపరాష్ట్రపతి రాక

image

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని.. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌తో కలిసి అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 26న ఉదయం 11.25కు ఉపరాష్ట్రపతి తిరుమలకు రానున్నట్టు చెప్పారు. 25న తిరుపతికి గవర్నర్ వస్తారని వెల్లడించారు.

Similar News

News September 30, 2024

తిరుపతి : రేపు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు

image

శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ నందు కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు మంగళవారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్, అనస్తీషియా టెక్నీషియన్, జూనియర్/ సీనియర్ ఫిజీషియన్ అసిస్టెంట్ మొత్తం 6 రకాల పోస్టులు 8 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు http://slsmpc.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News September 30, 2024

SVU : ఫీజు చెల్లించడానికి నేడు చివరి తేదీ

image

SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.

News September 30, 2024

సబ్ కలెక్టర్ రేట్ ఫైళ్ల దగ్ధం కేసులో రికార్డులు తీసుకెళ్లిన సిఐడి

image

మదనపల్లె సబ్ కలెక్టర్ రేట్ లో ఫైళ్ల దగ్ధం అనంతరం సీజ్ చేసిన రికార్థులను ఆదివారం ప్రత్యేకవాహనంలో తిరుపతి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. శనివారం మదనపల్లెకు వచ్చిన సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ రెండు రోజులపాటు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో కేసులోని కొందరిని విచారించారు. అనంతరం అప్పట్లో కేసుకు సంబంధించి సీజ్ చేసిన రికార్డులు అన్నింటినీ స్వాధీనంచేసుకుని తీసుకెళ్లడంతో ఫైల్ దగ్ధం కేసు మరుగున పడిందనట్లయింది.