News November 26, 2024
మన ధైర్యాన్ని పరీక్షించిన రోజు 26/11: సచిన్

ముంబైలో ఉగ్రదాడి జరిగి నేటికి 16 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆ రోజును ట్విటర్లో గుర్తుచేసుకున్నారు. ‘2008 నవంబరు 26.. మనల్ని పరీక్షించిన ఆ రోజు మన ధైర్యాన్ని దెబ్బతీయలేకపోయింది. ఓ జాతిగా మనకున్న బలాన్ని ఆరోజు మన హీరోలు చూపించిన తెగువ, ముంబైలోని ప్రతి పౌరుడి పట్టుదల ఎప్పుడూ గుర్తుచేస్తుంటాయి. గుర్తుపెట్టుకుంటాం. గౌరవించుకుంటాం. ఐకమత్యంగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 2, 2025
చంద్రబాబు కేసులను మూసివేయిస్తున్నారు: MLC బొత్స

AP: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించేందుకు CM <<18441609>>చంద్రబాబు<<>> అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని YCP MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. “స్కిల్, అసైన్డ్ ల్యాండ్స్, రింగ్రోడ్, ఫైబర్నెట్, లిక్కర్ సహా పలు కేసులు ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో పురోగతి లేదు. గవర్నర్ చర్యలు తీసుకోవాలి” అని కోరారు.
News December 2, 2025
ఉచితంగా క్రికెట్ మ్యాచులు చూసే అవకాశం

క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. హైదరాబాద్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మ్యాచులను ఫ్రీగా చూసేందుకు అభిమానులను అనుమతిస్తున్నారు. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, షమీ, హర్షల్ పటేల్తో పాటు పలువురు ప్లేయర్లు ఈ సిరీస్లో ఆడుతున్నారు. ఉప్పల్తో పాటు జింఖానా, ఎల్బీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతున్నాయి. షెడ్యూల్ <
News December 2, 2025
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<


