News December 27, 2024
26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ మృతి

ముంబై ఉగ్రదాడి(26/11) వెనుక మాస్టర్ మైండ్, లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ గుండెపోటుతో మరణించాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం హార్ట్ఎటాక్తో చనిపోయాడు. 2023లో UNO అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్పై విషం చిమ్మే హఫీజ్ రామ్పుర, ఎర్రకోట, ముంబై దాడుల్లో కీలకపాత్ర పోషించారు.
Similar News
News January 8, 2026
ప్రీమియర్స్ కోసం వెయిటింగ్ ‘రాజాసాబ్’!

TG: ‘రాజాసాబ్’ ప్రీమియర్స్ విషయంలో సస్పెన్స్ వీడటం లేదు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో ఫ్యాన్స్కు ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ప్రీమియర్స్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. అప్డేట్ ఇవ్వాలంటూ మేకర్స్ను అడుగుతున్నారు. కాగా మరికాసేపట్లో రాజాసాబ్ ప్రీమియర్లపై జీవో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
News January 8, 2026
ఈడీ రెయిడ్స్.. ఇంతకీ ప్రతీక్ జైన్ ఎవరు?

ఐప్యాక్ ఆఫీసు, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిపై <<18796717>>ED దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీక్ జైన్ ఎవరనే చర్చ జరుగుతోంది. IIT బాంబే పూర్వ విద్యార్థి అయిన ప్రతీక్ ఎన్నికల వ్యూహం, డేటా విశ్లేషణలో ఎక్స్పర్ట్. I-PAC కోఫౌండర్. 2019 నుంచి TMCతో కలిసి పని చేస్తున్నారు. ఆ పార్టీ IT సెల్ హెడ్గానూ ప్రతీక్ కొనసాగుతున్నారు. TMCతోపాటు పలు పార్టీలు, ప్రభుత్వాలకు సలహాదారుగా I-PAC వ్యవహరిస్తోంది.
News January 8, 2026
ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్.. సీఎం సమీక్ష

TG: సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని రివ్యూ మీటింగ్లో సూచించారు. ‘సోలార్ కిచెన్ల ఏర్పాటును పరిశీలించాలి. యంగ్ ఇండియా స్కూళ్ల పనుల్ని వేగవంతం చేయాలి. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని చెప్పారు.


