News February 10, 2025
26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.
Similar News
News April 6, 2026
ప్చ్.. ఇంకా IPL ఆడాల్సింది: అశ్విన్

IPLలో వరుసగా 3 మ్యాచుల్లో CSK ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ ప్లేయర్ అశ్విన్ నిరాశ వ్యక్తం చేశారు. గత సీజన్లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఉండాల్సింది కాదని వాపోయారు. జట్టుపై నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని, లేదంటే ఈ సీజన్ కూడా ఆడేవాడినని పేర్కొన్నారు. మేనేజ్మెంట్కు ఇబ్బంది కలగొద్దని, తన వల్ల ఫ్రాంచైజీకి ₹10 కోట్లు మిగులుతాయనే భావించానన్నారు. మానసిక అలసట వల్లే గుడ్బై చెప్పాల్సి వచ్చిందని వివరించారు.
News April 6, 2026
భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయా.. అదెలా సర్?

ఉజ్జయినిలో భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2 వేర్వేరు అక్షాంశాల్లో ఉండే లైన్స్ ఎలా కలుస్తాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘భూమధ్య రేఖ(Equator), కర్కాటక రేఖ(Tropic of Cancer).. సమాంతర రేఖలు. అవి కలవవు. మీరు BJPకి ఓటు వేస్తే విద్యావ్యవస్థను తీర్చిదిద్దేది ఇలాంటి వ్యక్తులే’ అని TMC నేత సాకేత్ గోఖలే ఎద్దేవా చేశారు.
News April 6, 2026
రేపే చంద్రుడి సమీపానికి వ్యోమగాములు.. ఫొటోల కోసం వెయిటింగ్!

‘ఆర్టెమిస్-2’ మిషన్ కీలక దశకు చేరుకుంది. రేపు జరగనున్న ‘లూనార్ ఫ్లైబై’ కోసం వ్యోమగాములు సర్వం సిద్ధం చేసుకున్నారని NASA పేర్కొంది. ఇప్పటివరకూ భూమి అద్భుత దృశ్యాలను పంపిన బృందం.. రేపు చంద్రుడిని అత్యంత సమీపం నుంచి ఫొటోలు తీయనుంది. ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చందమామ అందాలను దగ్గరగా చూసే సమయం ఆసన్నమైంది. *ఇప్పటివరకూ NASA షేర్ చేసిన ఫొటోలివే..


