News February 10, 2025

26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!

image

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్‌లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.

Similar News

News February 10, 2025

అత్యధిక ఫాలోవర్లున్న ఇన్‌స్టా అకౌంట్స్ ఇవే

image

ఇన్‌స్టాగ్రామ్-685 మిలియన్లు
క్రిస్టియానో రొనాల్డో – 649 మిలియన్లు
లియోనెల్ మెస్సీ – 505 మిలియన్లు
సెలీనా గోమెజ్- 422 మిలియన్లు
డ్వేన్ జాన్సన్ (రాక్) – 395 మిలియన్లు
కైలీ జెన్నర్ – 394 మిలియన్లు
అరియానా గ్రాండే – 376 మిలియన్లు
*ఇండియాలో విరాట్ కోహ్లీ (270 మిలియన్లు) అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్నారు.

News February 10, 2025

రాజకీయ లబ్ధి కోసమే లడ్డూ ఆరోపణలు: అంబటి

image

AP: రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. సీఎం వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కూడా వంత పాడుతున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు వచ్చాకే AR సప్లైస్ నెయ్యి సరఫరా చేసింది. మరి మా హయాంలో లడ్డూ ప్రసాదం ఎలా కల్తీ అవుతుంది? లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడారని పచ్చి అబద్ధం ఆడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News February 10, 2025

BREAKING: అకౌంట్లో డబ్బుల జమ

image

తెలంగాణలోని రైతులకు శుభవార్త. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున మొత్తం 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసింది. కాగా ఇప్పటికే ఎకరం పొలం ఉన్న 17 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు, 557 పైలట్ గ్రామాలకు చెందిన వారికి రూ.568 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09కోట్లు జమ అయ్యాయి.

error: Content is protected !!