News February 19, 2025

27న కాకినాడ జిల్లాలో సెలవు

image

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News October 19, 2025

దీపావళి సందర్భంగా రేపు పీజీఆర్ఎస్ రద్దు

image

దీపావళి పండుగ సెలవు దినం సందర్భంగా 20వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉండదని ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్‌ ఒక ప్రకటనలో కోరారు.

News October 19, 2025

ఇతిహాసాలు క్విజ్ – 40 సమాధానాలు

image

1. వాల్మీకి రామాయణంలో మొత్తం ‘24 వేల’ శ్లోకాలు ఉన్నాయి.
2. ‘యముడి’ అనుగ్రహం వల్ల కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు.
3. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని ‘మాస శివరాత్రి’ అని అంటారు.
4. హనుమాన్ చాలీసాను రచించిన భక్తుడు ‘తులసీదాస్’.
5. భద్రాచలం రాముడి ఆలయాన్ని నిర్మించింది ‘కంచర్ల గోపన్న’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 19, 2025

పేకాట ఆడితే చర్యలు తప్పవు: కామారెడ్డి ఎస్పీ

image

పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడినందుకు ఇప్పటికే 39 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.79,300 నగదు, 29 మొబైల్స్, 9 మోటర్ సైకిల్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.