News February 19, 2025
27న కాకినాడ జిల్లాలో సెలవు

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News December 13, 2025
పోచారంలో పదవుల పరేషానీ.!

GHMC పునర్విభజనలో భాగంగా పోచారం మున్సిపాలిటీని కేవలం ఒకే డివిజన్గా కుదించడంపై నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సుమారు 90 పదవులు కనుమరుగు కానుండడంతో, స్థానిక రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తోంది. రాజకీయంగా ఎదగాలనుకున్న ఆశావహుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. దాదాపు లక్షకు పైగా ఓట్లున్న ఈ ప్రాంతాన్ని 2-3 డివిజన్లుగా చేయాలని, ఇప్పటి వరకు 65 అభ్యంతరాలు వచ్చాయని Way2Newsకు DC నిత్యానంద్ తెలిపారు.
News December 13, 2025
NGKL: పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి: కలెక్టర్

జిల్లాలో రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంటకు నిలిపివేయాలని, భోజన విరామం అనంతరం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 151 గ్రామపంచాయతీలకు గాను 147 గ్రామాలలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
News December 13, 2025
NGKL: 147 గ్రామాలలో 473 మంది సర్పంచ్ అభ్యర్థులు

జిల్లాలో ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 147 గ్రామ పంచాయతీల్లో 473 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 151 గ్రామాలకు గాను 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 1412 వార్డులకు గాను 143 వార్డులు ఏకగ్రీవం కాగా 1269 వార్డులలో 3228 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు, తిమ్మాజీపేటలలో ఎన్నికలు జరగనున్నాయి.


