News March 25, 2024

27న నెల్లూరుకు చంద్రబాబు నాయుడు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 27న నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన పర్యటన సాగనుంది. ఈ మేరకు సమాచారం రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.

Similar News

News December 17, 2025

భారత ఉపరాష్ట్రపతిని కలిసిన MP వేమిరెడ్డి

image

నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయానికి బుధవారం MP వెళ్లారు. ఇందులో భాగంగా వేమిరెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు అంశాలపై చర్చించారు.

News December 17, 2025

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయండి: MP

image

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సంతోశ్ కుమార్‌ను ఢిల్లీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన్ను MP మర్యాదపూర్వకంగా కలిశారు. బిట్రగుంట అభివృధ్ధి, ROB, RUBల పూర్తి, వివిధ ప్రాంతాల్లో ప్రధాన ట్రైన్లకు హాల్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో రైల్వే పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

News December 17, 2025

నెల్లూరు: డ్రోన్స్ తిరుగుతున్నాయ్ తస్మాత్ జాగ్రత్త!

image

నెల్లూరు నగరం, చుట్టు పక్కల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రోన్స్ తిరుగుతున్నాయి. వాటి పని ఏమిటంటే మారుమూల ప్రాంతాల్లో, పాడుబడిన భవనాల్లో ఎక్కడెక్కడ ఆకతాయిలు తిరుగుతారో వారిని టార్గెట్ చేస్తాయి ఈ డ్రోన్లు. వారు ఏమి చేస్తున్నారు. ఎక్కడ ఉన్నారో పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది. వారు పేకాట ఆడుతున్నారా.. మద్యం తాగుతున్నారా.. మరేమైనా చీకటి పనులు చేస్తున్నారా అనేది తెలిసిపోయి పోలీసులు దాడులు చేస్తారు.