News October 14, 2024
27వ వసంతంలోకి ద్రావిడ విశ్వవిద్యాలయం

కుప్పంలోని ద్రావిడ ద్రావిడ వర్సిటీ 27వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 20వ తేదీన వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం జరపనున్నట్లు రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ వేడుకలకు చిత్తూరు ఎంపీ డి.ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, కలెక్టర్ సుమిత్ కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్ హాజరవుతారని చెప్పారు.
Similar News
News November 12, 2025
నేడు జిల్లా వ్యాప్తంగా 10,168 గృహ ప్రవేశాలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 10,168 గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మరోవైపు PMAY 2.O క్రింద 2,472 ఇళ్లులు మంజూరు కాగా వాటి లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1లక్షను అందించనుంది.
News November 11, 2025
మౌలానాకు నివాళులు అర్పించిన ఎస్పీ

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం నివాళులు అర్పించారు. దేశ తొలి విద్యామంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నిరక్షరాస్యత పేదరికం రూపుమాపడానికి అనేక సేవలు చేశారని వెల్లడించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు.
News November 11, 2025
పూతలపట్టు: అదుపుతప్పి ఐచర్ వాహనం బోల్తా

పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో గల జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఐచర్ వాహనం అతివేగంగా వెళ్లి బోల్తా పడింది. ఇందులో ఉన్న దానిమ్మ కాయలు కోసం ప్రజలు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్కి స్వల్ప గాయాలు అయ్యాయి.


