News February 19, 2025
27న కాకినాడ జిల్లాలో సెలవు

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News July 4, 2025
వలస కార్మికుల కుటుంబాలకు గౌరవం ఇవ్వరా?: KTR

TG: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన భయానకమని మాజీ మంత్రి KTR అన్నారు. ఈ ఘటనలో మృతుల శరీర అవశేషాలను కార్డ్బోర్డ్ పెట్టెల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. తమవారి ఆచూకీ చెప్పాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని, శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని విమర్శించారు. SLBC ఘటనలో పరిహారం కోసం 8 కుటుంబాలు వేచి చూస్తున్నాయని, వలస కార్మికుల కుటుంబాలకు గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు.
News July 4, 2025
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ: డీఐఈఓ

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని వనపర్తి DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. వాటి అభివృద్ధికి రూ. 1.28 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయా కళాశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులు, విద్యుత్, తదితర పనులు చేపట్టనున్నారని తెలిపారు.
News July 4, 2025
మార్కాపురం జిల్లాపై మాటెత్తని పవన్..!

మార్కాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మార్కాపురాన్ని ఎప్పుడు జిల్లా చేస్తామనే దానిపై ఆయన ప్రకటన చేస్తారని ఆశగా చూశారు. కానీ మార్కాపురం జిల్లాపై ఆయన ఏం మాట్లాడలేదు. వెలిగొండ ప్రాజెక్టు భూనిర్వాసితులకు నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులను తానే పర్యవేక్షిస్తూ 20నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం.