News March 25, 2025

27న జగిత్యాల, ధర్మపురిలో పర్యటించనున్న బీసీ కమిషన్

image

ఈ నెల 27న తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలలో పర్యటిస్తారని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మంగళవారం తెలిపారు. జిల్లాలోని వంశరాజ్, వీరబద్రియ, దొమ్మర కులాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి వస్తున్నారని కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను, వినతులను కమిషన్‌కు సమర్పించాలని కోరారు.

Similar News

News March 26, 2025

గుంటూరు: రాష్ట్ర జీఎస్టీ స్పెషల్ కమిషనర్‌గా నూతలపాటి సౌమ్య

image

గుంటూరులోని కస్టమ్స్, జీఎస్టీ అప్పీల్స్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న నూతలపాటి సౌమ్య, రాష్ట్ర జీఎస్టీ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమితులయ్యారు. మంగళవారం స్టేట్ ట్యాక్సెస్ (జీఎస్టీ) చీఫ్ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన సౌమ్య సీనియర్ అధికారి. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక హోదాతో ఆమె మూడేళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ శాఖలో పనిచేస్తారు.

News March 26, 2025

భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

image

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్‌ ఆలయం నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్‌ను గోషామహల్‌ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.

News March 26, 2025

భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

image

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్‌ ఆలయం నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్‌ను గోషామహల్‌ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.

error: Content is protected !!