News March 25, 2025
27న జగిత్యాల, ధర్మపురిలో పర్యటించనున్న బీసీ కమిషన్

ఈ నెల 27న తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలలో పర్యటిస్తారని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మంగళవారం తెలిపారు. జిల్లాలోని వంశరాజ్, వీరబద్రియ, దొమ్మర కులాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి వస్తున్నారని కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను, వినతులను కమిషన్కు సమర్పించాలని కోరారు.
Similar News
News February 28, 2026
మద్దూర్ నగర్లో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులోని మద్దూర్ నగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా సరైన సమయానికి పింఛన్ అందుతుందా అని లబ్ధిదారులను అడిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News February 28, 2026
భద్రాద్రి: కో-ఆప్షన్ మెంబర్ పదవికై ఆశావాహుల ఆసక్తి

కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు మున్సిపాలిటీ, అశ్వారావుపేట మున్సిపాలిటీ పాలకవర్గం కొలువుతీరిన నేపథ్యంలో కో-ఆప్షన్ మెంబర్ ఎంపికకు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక కొరకు నోటిఫికేషన్ విడుదల కాకముందే ఆశావాహులు తమను కో -ఆప్షన్ మెంబర్గా ఎంపిక అయ్యేలా చూడాలని నాయకుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. మరి నాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.
News February 28, 2026
మెట్రో రైల్ రికార్డు.. 80 కోట్ల ప్రయాణాలు పూర్తి

హైదరాబాద్ మెట్రో రైలు మరో మైలు రాయిని చేరుకుంది. నగరవాసులకు గమ్యాన్ని సుగమం చేసిన మెట్రో రైలు ప్రారంభం నుంచి ఇప్పటివరకు 80 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసింది. 2017 నవంబర్లో ప్రారంభమైన ఈ సేవలు రోజు రోజుకీ నగర ప్రజల ఆదరణ పొందుతుంది. ప్రతిరోజూ 4.1 నుంచి 4.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ప్రతి నెలా 1.2 కోట్లకు పైగా ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు.


