News December 20, 2024

అమెజాన్‌ అడవిలో 27 కొత్త జీవజాతుల గుర్తింపు

image

పెరూలోని అమెజాన్ అడవిలో సైంటిస్టులు కొత్తగా 27 రకాల జీవజాతుల్ని గుర్తించారు. 2022లో ఈ అడవుల్లో వారు చేసిన పరిశోధనల ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. గుర్తించిన వాటిలో చిట్టెలుకలు, ఉడతలు, చేపలు, ఉభయచర జీవులు, సీతాకోకచిలుకల జాతులు ఉన్నాయన్నారు. మరో 48 జాతుల్ని కూడా గుర్తించినా వాటిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. గిరిజనులు నివసించే ఆల్టో మాయో ప్రాంతంలో ఇవన్నీ కనిపించినట్లు వివరించారు.

Similar News

News January 23, 2026

మేడారం జాతరకు కేంద్రం నిధులు విడుదల

image

TG: మేడారం జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి జరగనున్న వేడుకల్లో వసతుల కోసం అధికారులు వీటిని ఖర్చు చేయనున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘గిరిజన సర్క్యూట్ పేరిట’ రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.

News January 23, 2026

త్వరలో బీజేపీలోకి శశిథరూర్?

image

కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి పార్టీ MP శశిథరూర్ గైర్హాజరయ్యారు. అదే సమయంలో తిరువనంతపురంలో జరిగిన PM మోదీ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే మోదీ పాలనను ప్రశంసించిన థరూర్‌ను INC దూరం పెట్టినట్లు ప్రచారం ఉంది. ఇటీవల రాహుల్ ఓ ప్రసంగంలో తన పేరును విస్మరించడంతో థరూర్ అసంతృప్తిగానూ ఉన్నారు. ఈ పరిణామాలతో ఆయన త్వరలోనే BJPలో చేరొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

News January 23, 2026

సింగరేణి టెండర్లపై విచారణ కోరుతూ కిషన్ రెడ్డికి హరీశ్ లేఖ

image

TG: నైనీ కోల్ స్కామ్‌పై విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి BRS MLA, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. సింగరేణిలో అన్ని టెండర్లను రద్దు చేయాలని కోరారు. సింగరేణి టెండర్లపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. జడ్జితో కుదరకపోతే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. CM రేవంత్ సింగరేణిలో మరో <<18937157>>3 స్కామ్‌లకు<<>> పాల్పడ్డారని హరీశ్ ఆరోపించారు.