News November 30, 2024
2700 ఏళ్ల నాటి భారీ సౌరతుఫాను.. చెట్లలో ఆనవాళ్లు

గడచిన 14,500 ఏళ్లలో అతి తీవ్రస్థాయి సోలార్ తుఫాన్లు 6సార్లు మాత్రమే భూమిని తాకాయి. వాటిలో చివరిది క్రీ.పూ 664-663 మధ్య సంవత్సరాల్లో వచ్చినట్లు అమెరికా పరిశోధకులు తెలిపారు. సైబీరియాలో పురాతనమైన చెట్ల మధ్యలో ఉన్న రింగ్స్లో ఆ ఆనవాళ్లు నిక్షిప్తమయ్యాయని వివరించారు. మున్ముందు భూమిపైకి దూసుకొచ్చే తీవ్ర సౌర తుఫానులు చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని వారు తెలిపారు.
Similar News
News November 24, 2025
48 గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం

మలేషియా-అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి 48 గంటల్లో ఇది దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు అధికారులు చెప్పారు.
News November 24, 2025
బంకుల్లో జీరోతో పాటు ఇది కూడా చూడండి

వెహికల్స్లో పెట్రోల్/ డీజిల్ ఫిల్ చేయిస్తే మెషీన్లో 0 చెక్ చేస్తాం కదా. అలాగే ఫ్యూయల్ మెషీన్పై ఉండే డెన్సిటీ మీటర్ నంబర్స్ గమనించారా? BIS గైడ్లైన్స్ ప్రకారం క్యూబిక్ మీటర్ పెట్రోల్: 720-775 kg/m³ లేదా 0.775 kg/L, డీజిల్: 820 to 860 kg/m³ ఉండాలి. ఇది ఫ్యూయల్ ఎంత క్వాలిటీదో చెప్పే మెజర్మెంట్. ఇంజిన్ పర్ఫార్మెన్స్, జర్నీకి ఖర్చయ్యే ఫ్యూయల్పై ప్రభావం చూపే డెన్సిటీపై ఇకపై లుక్కేయండి.
Share It
News November 24, 2025
రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

హైదరాబాద్లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్పై ఈ రైడ్స్ జరిగాయి.


