News July 26, 2024

28న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు ఎంపిక

image

ఏలూరు కోటదిబ్బ కస్తూర్బా నగర బాలికోన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 28న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ బాలబాలికల జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు 1- 1- 2011 తర్వాత జన్మించి ఉండాలన్నారు. తమ వెంట జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తెచ్చుకోవాలన్నారు.

Similar News

News November 24, 2025

దివ్యాంగురాలి దగ్గరకు వెళ్లి అర్జీ తీసుకున్న ప.గో కలెక్టర్

image

అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కాగా, ఓ దివ్యాంగురాలు అర్జీ ఇచ్చేందుకు రాగా.. కలెక్టర్‌ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

News November 24, 2025

తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

image

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.

News November 24, 2025

ప.గో జిల్లాలో 70 మందికి అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి

image

ప.గో జిల్లాలో పని చేస్తున్న 70 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్ గ్రేడ్ చేసినట్లు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామ అన్నారు. ఉండి నియోజకవర్గంలో 13 మందికి పదోన్నతి లభించిందన్నారు. సోమవారం పెద అమిరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉత్తర్వులను అందించారు. వీరికి వేతనం రూ 7. వేలు – రూ .11,500కి పెరుగుతుందన్నారు.