News September 25, 2024

28న ఎంజే మార్కెట్‌లో గజల్, షాయరీ

image

సిటీ వారసత్వాన్ని కాపాడడంతోపాటు, కళలను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం ఎంజే మార్కెట్ ప్రాంగణంలో గజల్, షాయరీ నిర్వహించనున్నారు. దీన్ని వినిపించడానికి ప్రముఖ కళాకారులు రాన్నారు. బుక్‌మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగా ఉన్నవారు బుక్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.

Similar News

News October 27, 2025

HYD: సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2026-27 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశాల కోసం NTA నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల గడువు అక్టోబర్ 30తో ముగియనుంది. 10- 12 ఏళ్లు (6వ తరగతి), 13-15 ఏళ్లు (9వ తరగతి) మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు www.aissee.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష జనవరి రెండో వారంలో జరుగుతుంది.

News October 27, 2025

కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద భారీ భద్రత

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన గేటు వద్ద ఏసీపీ, 3 ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు SIలు, 8 మంది ASIలు, 41 మంది కానిస్టేబుళ్లు ఉండనున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఒక ప్లాటూన్ సాయుధ బలగాలు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండనున్నాయి. స్టేడియానికి వెళ్లే రోడ్డులో 6 పికెటింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

News October 27, 2025

‘ఇంతకీ జూబ్లీహిల్స్‌లో ఏం అభివృద్ధి చేస్తారంట’

image

తెలంగాణలో ఖరీదైన ఏరియా అంటే జూబ్లీహిల్స్ గుర్తొస్తుంది. ఇక్కడ లేని షాపింగ్ మాల్ లేదు. తిరగని సెలబ్రెటీ ఉండరు. కొండ ప్రాంతం ఎవరి ఊహలకు అందనంత అభివృద్ధి చెందింది. బైపోల్ సందర్భంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి తమ పార్టీలతోనే సాధ్యమని నేతలు అంటున్నారు. పొరుగు రాష్ట్రాలు తమ ప్రాంతాన్ని జూబ్లీహిల్స్‌ అంత అభివృద్ధి చేస్తామని చెబుతుంటే, కొత్తగా ఇక్కడ ఏంఅభివృద్ధి చేస్తారో చెప్పకపోవడం ఓటర్లకు అంతుచిక్కని ప్రశ్న.