News March 27, 2025
28న కాకినాడలో ఇఫ్తార్ విందు: కలెక్టర్

కాకినాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు కలెక్టరు షాన్మోహన్ సగిలి తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కావున ప్రజా ప్రతినిధులు, ముస్లిం పెద్దలు, జిల్లా అధికారులు ఇఫ్తార్ విందుకు హాజరుకావాలని కలెక్టర్ కోరారు.
Similar News
News December 3, 2025
పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.
News December 3, 2025
మెదక్: తండ్రీకొడుకుల మధ్య సర్పంచ్ పోటీ

రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం తండ్రీకొడుకులు పోటీ పడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రామానికి చెందిన మానెగళ్ళ రామకృష్ణయ్య, ఆయన కొడుకు వెంకటేష్ నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామంలో మొత్తం 10 వార్డులు, 1563 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్ స్థానానికి 10 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్కి తండ్రి కొడుకు పోటీ చేయడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
News December 3, 2025
నల్గొండ: తెలుగు అక్షర క్రమంలోనే గుర్తులు!

జిల్లాలో మ.3 గంటల తర్వాత మొదటి దశ ఎన్నికలో బరిలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. వెంటనే వారికి గుర్తులను కేటాయిస్తారు. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లలో తెలుగు అక్షర క్రమంలో గుర్తుల కేటాయింపు ఉండనుంది. నామినేషన్లలో పేర్లు ఎలా రాశారో అలాగే తెలుగు అక్షరాల క్రమాన్ని గుర్తిస్తారు. కొందరు తమ ఇంటి పేరును ముందుగా,మరికొందరు చివరగా రాస్తారు.


