News June 24, 2024

28న వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

వరంగల్ నగరంలో ఈ నెల 28న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కుడా పరిధిలో చేపట్టబోయే అండర్ డ్రైనేజీ పనులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

Similar News

News October 9, 2024

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: సీఈఓ నాగిరెడ్డి

image

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పన పై మంగళవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నాగిరెడ్డి, MHBD జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం ద్వారా శిక్షణ అందించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి MDK- NZBD- ADLD- KNR జిల్లాల ఉపాధ్యాయులు, పట్టభద్రుల MLC స్థానాలు, WGL- KMM -NLG జిల్లాలో ఉపాధ్యాయుల MLC ఖాళీ కానున్నది. వీటి భర్తీ కోసం ఓటరు జాబితా రూపకల్పన చేపట్టాలని ఆదేశించారు.

News October 8, 2024

బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన మంత్రి సురేఖ

image

ఆలంపూర్లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సురేఖకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి చర్చించారు. స్థానిక నేతలు పాల్గొన్నారు.

News October 8, 2024

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పలు రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ రూ.6100 ధర పలకగా, పచ్చి పల్లికాయ ధర రూ.4,000 పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి రూ. 14వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా ఫలితాలను గత వారంతో పోలిస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు రైతులు పేర్కొన్నారు.