News March 26, 2024

28న ఓయూ వార్షిక బడ్జెట్..

image

ఓయూ వార్షిక బడ్జెట్-2024 ఈనెల 28న సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన తరుణంలో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వేతనాలు పెన్షన్‌కు సరిపోవడం లేదన్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 24, 2025

MDK: ‘ఆశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం’

image

రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగ యువతను ఆశపెట్టిందని చెప్పొచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. దీంట్లో సిబిల్ స్కోర్‌ను బట్టి లబ్దిదారుల ఎంపిక నిర్వహిస్తున్నారు. ఐతే ఇప్పటికీ ఈ పథకం పై లబ్ధిదారుల వివరాలు అధికారులు తెలపలేదు. ఈ పథకం ద్వారా సొంత వ్యాపార నిమిత్తం రూ.5 లక్షల రుణం ప్రభుత్వం ఇస్తుంది. ఆశ పెట్టి వదిలేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

News October 24, 2025

మెదక్: సర్పంచులు లేక మరుగునపడుతున్న గ్రామాలు!

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు సర్పంచులు లేక పూర్తిగా మరుగున పడిపోతున్నాయి. గ్రామంలో చిన్న సమస్యను చెప్పడానికి గ్రామానికి పెద్ద దిక్కు లేకపోవడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే.. అయిన గ్రామ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తే కోర్టులు ఎన్నికలను నిలిపివేశాయి. గ్రామాల్లో నియమించిన స్పెషల్ ఆఫీసర్లు కంటికి కనిపించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

News October 24, 2025

మెదక్ జిల్లాలో 1420 మద్యం దరఖాస్తులు

image

మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాల కోసం 1420 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పోతంశెట్టిపల్లి దుకాణానికి 54 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం సమయం పొడిగించడంతో 33 దరఖాస్తులు పెరిగాయి. మెదక్ సర్కిల్లో 17 దుకాణాలకు 513, నర్సాపూర్ సర్కిల్లో 17 దుకాణాలకు 519, రామాయంపేట సర్కిల్లో 15 దుకాణాలకు 388 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ.42.60 కోట్ల ఆదాయం చేకూరింది.