News February 14, 2025

280 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఇల్లందు మండలం మర్రిగూడెం వద్ద అధికారులు సుమారు 280 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి నుంచి విజయవాడ తరలిస్తున్నట్లు గుర్తించారు.

Similar News

News November 14, 2025

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి సీఐఐ సదస్సు

image

AP: రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వైజాగ్‌లో CII భాగస్వామ్య సదస్సు ఇవాళ, రేపు జరగనుంది. దీని కోసం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ CM చంద్రబాబు పలు దేశాల్లో పర్యటించారు. ‘ఇన్వెస్ట్ ఇన్ AP’ సందేశంతో, ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047’ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తోంది.

News November 14, 2025

ఇటిక్యాల: బాలిక కిడ్నాప్ కేసు.. 35 ఏళ్లు జైలు

image

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, రేప్ చేసిన కేసులో ఇటిక్యాల మండలం గార్లపాడుకు చెందిన చాకలి హరిచంద్రకు 35 ఏళ్లు జైలు శిక్ష, రూ. 50 వేలు జరిమానా విధిస్తూ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రవికుమార్ గురువారం గద్వాలలో తీర్పునిచ్చారు. నేరస్థుడిపై కోదండపూర్ పిఎస్‌లో 22-7-2017 కేసు నమోదైంది. విచారణ చేపట్టిన కోర్టు లైసెన్స్ అధికారులు సాయిబాబ, జిక్కి బాబు అతడికి శిక్ష పడే విధంగా కృషి చేశారు.

News November 14, 2025

లైంగిక దాడి నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష

image

హిందూపురం యువకుడు వెంకటరమణకు 25ఏళ్ల జైలు శిక్ష పడిందని తెలంగాణలోని గద్వాల SP శ్రీనివాసరావు తెలిపారు. 2024లో వడ్డేపల్లి మండలంలోని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పారు. దీనిపై శాంతినగర్ పీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం గద్వాల ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రవికుమార్ నిందితుడికి 25ఏళ్ల జైలు శిక్ష, రూ.40వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారని చెప్పారు.