News February 14, 2025

280 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఇల్లందు మండలం మర్రిగూడెం వద్ద అధికారులు సుమారు 280 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి నుంచి విజయవాడ తరలిస్తున్నట్లు గుర్తించారు.

Similar News

News October 16, 2025

పర్వతగిరి: డెంగీతో విద్యార్థి మృతి

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన భాషబోయిన ఏకాంబరం కుమారుడు ప్రవేశ్ (9) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం జ్వరం రాగా, తొర్రూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబీకులు తీసుకువెళ్లారు. అక్కడ నయం కాకపోవడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News October 16, 2025

కేటిదొడ్డి: గుప్తనిధుల కోసం తవ్వకాలు

image

కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె సమీపంలో గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపక్కకు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర తవ్వకాలు చేపట్టారు. నిధుల కోసం పెద్ద గుంతను తవ్వారు. దుండగులు తవ్వడం చేతకాక మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. ఆలయంలో ఎలాంటి వస్తువులు విగ్రహాలు ధ్వంసం కాలేదని గ్రామస్థులు తెలిపారు.

News October 16, 2025

అప్పుడు సమంత.. ఇప్పుడు సుమంత్..!

image

మంత్రి సురేఖ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. గతంలో నటి సమంత పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. చివరకు పరువు నష్టం కేసు పెట్టే వరకు వెళ్లింది. తాజాగా ఓఎస్డీ సుమంత్ వ్యవహారం ఆమె మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి సైతం ఎసరు పెట్టేలా మారింది. ‘స’ అనే అక్షరం కలిసి రావడం లేదేమో? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.