News March 3, 2025
280 మంది ఇంటర్ పరీక్షలు రాయలేదు: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 280 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 12,318 మంది విద్యార్థులకు గాను 12,038 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News December 19, 2025
పి.గన్నవరంలో యాక్సిడెంట్.. యువకుడు మృతి

పి. గన్నవరం కొత్త బ్రిడ్జి సమీపంలో శుక్రవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. కొత్తపేట మండలంలోని అవిడికి చెందిన సుమంత్ కుమార్ (25) గన్నవరం సెంటర్కు వచ్చే సమయంలో బైక్ అదుపుతప్పడంతో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. అతడు అక్కడికక్కడే మృతి చెందగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News December 19, 2025
HALలో 156 ఉద్యోగాలకు నోటిఫికేషన్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)లో 156 ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తారు. ఎలక్ట్రానిక్స్, ఫిట్టింగ్, గ్రిండింగ్, మెషినింగ్, టర్నింగ్ కేటగిరీల్లో ఖాళీలున్నాయి. సంబంధిత ట్రేడ్లో మూడేళ్ల NAC లేదా రెండేళ్ల ITI(+ NAC/NCTVT) పాసైన వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ DEC 25. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News December 19, 2025
పాలకొల్లు: ఐఈఎస్లో సత్తాచాటిన లంకలకోడేరు యువతి

పాలకొల్లు మండలం లంకలకోడేరుకు చెందిన కవిత బేబీ బుధవారం రాత్రి విడుదలైన యూపీఎస్సీ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్ ) ఫలితాల్లో 48వ ర్యాంకుతో సత్తాచాటింది. తాను తొలిసారి 2024లో యూపీఎస్సీ పరీక్షకు హాజరై విఫలమయ్యానని, పట్టుదలతో కృషి చేసి ఇప్పుడు మంచి ర్యాంకు సాధించానని కవిత పేర్కొన్నారు. టెలీకమ్యూనికేషన్ శాఖలో ఉద్యోగం సాధించాలనేది తన ఆశయమన్నారు. కవితకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.


