News March 20, 2024

29న కర్నూలు జిల్లాలో ‘మేము సిద్ధం’: మంత్రి పెద్దిరెడ్డి

image

ఈనెల 29న సీఎం జగన్ మేము సిద్ధం బస్సుయాత్ర ఎమ్మిగనూరులో నిర్వహించనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం కర్నూలులోని త్రిగుణ క్లార్క్ ఇన్ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ పొన్నం రామసుబ్బారెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. 29న ఎమ్మిగనూరులో భారీ ఎత్తున సభను నిర్వహించనున్నారు.

Similar News

News October 20, 2025

నేడు పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ వేదిక జరగాల్సి ఉంది. పండుగ కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో కార్యక్రమం నిలిపివేశామని ఎస్పీ పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రజలు వ్యయప్రయాసలతో రావొద్దని విజ్ఞప్తి చేశారు.

News October 20, 2025

నేడు రద్దు: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ వేదిక జరగాల్సి ఉంది. పండుగ కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో కార్యక్రమం నిలిపివేశామని ఎస్పీ పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రజలు వ్యయప్రయాసలతో రావొద్దని విజ్ఞప్తి చేశారు.

News October 19, 2025

కర్నూలు: 9 నెలల్లో 6,858 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

కర్నూలు రేంజ్‌లో 9 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6,858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 13,555 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.