News March 20, 2024

29న కర్నూలు జిల్లాలో ‘మేము సిద్ధం’: మంత్రి పెద్దిరెడ్డి

image

ఈనెల 29న సీఎం జగన్ మేము సిద్ధం బస్సుయాత్ర ఎమ్మిగనూరులో నిర్వహించనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం కర్నూలులోని త్రిగుణ క్లార్క్ ఇన్ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ పొన్నం రామసుబ్బారెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. 29న ఎమ్మిగనూరులో భారీ ఎత్తున సభను నిర్వహించనున్నారు.

Similar News

News April 19, 2026

కర్నూలు జిల్లాలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానం, సెకండియర్‌లో ఎనిమిదో స్థానం నిలిచిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌లో 22,477 మందికి 16,356 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 18,999 మందికి 16,077 మంది పాసయ్యారు. 2,922 మంది ఫెయిలయ్యారు. సెకండియర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితో పాటు పాసైన వారూ మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు ఉంటాయి.

News April 18, 2026

భూగర్భ జలాల పెంచడమే లక్ష్యం: కలెక్టర్

image

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. శనివారం కోడుమూరు మండలం ఆమడగుంట్లలో నీటి భద్రత, జల ధార జల హారతి కార్యక్రమం నిర్వహించారు. వంకలను, వాగులను, చెరువులను గుర్తించి వాటికి మరమ్మత్ పనులు చేపట్టి నీరు నింపుతామన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నీటిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.

News April 18, 2026

జలధార పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన జలధార–జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 479 గ్రామాల్లో 3,435 పనులను గుర్తించినట్లు ఆమె తెలిపారు. చెరువులు, కుంటల పూడికతీత ద్వారా నీటి నిల్వలు పెంచడమే లక్ష్యమన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.